Thursday, March 28, 2024

Alert: సమతామూర్తి వద్దకు ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహం వద్దకు వీకెండ్ లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. సమతామూర్తి విగ్రహం వద్దకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లేవని, అక్కడికి వెళ్లేందుకు క్యాబ్ వాళ్లు రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ట్విట్టర్ లో ఎండీ దృష్టికి ఓ నెటిజన్ తీసుకెళ్లారు. వీకెండ్ లో అక్కడికి ఆర్టీసీ బస్ లను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. ఈ ట్వీట్ కు సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. “ఆర్టీసీ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఈ మార్గంలో ఆర్టీసీ బస్ ను ఏర్పాటు చేయండి. అందుకు అనుగుణంగా సమయాలను అప్ డేట్ చేయండి” అని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఖాతాలను ట్యాగ్ చేశారు. సమతామూర్తి విగ్రహం వద్దకు బస్ సౌకర్యం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆ ట్వీట్ కు ఉన్నతాధికారులు సమాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement