Saturday, May 4, 2024

ఢిల్లీ న్యాయ‌స‌ద‌స్సులో పాల్గొన‌నున్న- మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో న్యాయ‌స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement