Saturday, May 18, 2024

కమలాపూర్ మండలంలో దారుణం… బాలికపై అఘాయిత్యం

మహిళలు, బాలికలపై రోజు రోజుకో చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే.. మరికొన్ని తెరచాటున కనుమరుగైపోతున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా కమలాపురం గ్రామంలో దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై గురువారం రాత్రి సామూహిక లైంగికదాడి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు కలిసి లైంగికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రే ఒకరిని అదుపులోకి తీసుకోగా.. శుక్రవారం మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement