ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో పెద్ద ఎత్తున్న ఆందోళనకి దిగారు. అయినా వారి ఆందోళనకి కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. దాంతో టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ సెషన్ మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూర్చొని నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలు హైదరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్ తో చర్చలు జరిపే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ఛాన్స్ ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement