Wednesday, May 8, 2024

క‌రోనా త‌గ్గుతోంది – మ‌హాశివ‌రాత్రి, రంగ పంచ‌మిని ఘ‌నంగా జ‌రుపుకోండి – సీఎం శివ‌రాజ్ సింగ్

భోపాల్ – క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని .. మ‌హాశివ‌రాత్రిని ఘ‌నంగా జ‌రుపుకోండని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు సీఎం శివ‌రాజ్ సింగ్. రైతులకు పంటల బీమా పత్రాలను అందజేసే ప్రచారాన్ని ప్రారంభించేందుకు బుర్హి బర్లాయ్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న ప్రసంగించారు. మార్చి 1 న జరుపుకునే మహాశివరాత్రి నాడు ..ప్రజలు పూజ‌లు చేసుకోవ‌చ్చ‌న్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్ తగ్గుతోందని, శివ‌రాత్రితో పాటు రంగ పంచమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని చౌహాన్ అన్నారు. ఇండోర్‌లో, రంగ పంచమి నాడు సంప్రదాయ ఊరేగింపు జరుగుతుంది, దీనిలో వేలాది మంది ప్రజలు పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement