Monday, May 6, 2024

Gujarat: తీరంలో రూ. 400 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

గుజరాత్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. గుజరాత్ తీరంలో పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. దాదాపు 77 కిలోల హెరాయిన్‌ను కోస్ట్‌ గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 400 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. డ్రగ్స్‌ను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు వంటి విషయాలను ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement