Tuesday, May 7, 2024

మన ప్రజలు, మన ఖేర్సన్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఖేర్సన్ నగరం క్రమంగా తమ నియంత్రణలోకి వస్తున్నట్లు తెలిపింది ఉక్రెయిన్‌ రక్షణ శాఖ. ఈ మేరకు తమ ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే నగరంలోకి ప్రవేశించిందని తెలిపింది. ఈ పరిణామాన్ని ‘కీలక విజయంగా’ అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ‘ఖేర్సన్‌ నగరం ఇక మాదే’ అంటూ ప్రకటించారు. ‘మన ప్రజలు, మన ఖేర్సన్‌’ అంటూ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌ బలగాలు నగర శివార్లలో ఉన్నాయని, ప్రత్యేక విభాగాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. రష్యా సేనలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో వాటిని తొలగించేందుకు సంబంధిత నిపుణులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. తాజాగా ఖేర్సన్‌ పరిసరాల్లో ప్రజల సందడి, నగర వ్యాప్తంగా ఉక్రెయిన్‌ జెండాలు వెలసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో కనిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement