Thursday, May 16, 2024

మరోసారి ప్రియాంక గాంధీకి కరోనా

గత జూన్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను ’’ అని ఆమె ట్వీట్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రియాంకకు మరోసారి కరోనా సోకడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement