Thursday, May 2, 2024

రంజాన్ సంద‌ర్భంగా -దుస్తులు పంపిణీ చేసిన- మంత్రి ఎర్ర‌బెల్లి

రంజాన్ సంద‌ర్భంగా ముస్లింల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న దుస్తుల‌ను పంపిణీ చేశారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వమే దుస్తుల పంపిణీ చేయడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా సీఎం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క చిన్న ఘర్ష‌ణ‌ జరిగిందా.. బీజేపీ మాత్రం మత ఘర్షణలను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నది. పాలు నీళ్ల లెక్క కలిసి ఉండే హిందూ ముస్లిం ల మధ్య చిచ్చు పెట్టి రెచ్చ గొట్టి ఓట్లు దండుకునే పిచ్చి పనులు బీజేపీ చేస్తున్నది. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఈ విధంగా చేసినప్పటికీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంద‌న్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి 20 లక్షల స్కాలర్షిప్, రిజర్వేషన్ల పెంపు కోసం విఫల యత్నం, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం వంటి అనేక చర్యలను సీఎం కెసిఆర్ తీసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement