Sunday, April 28, 2024

యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ.. 20 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్య, దంత కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకుగాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పరిధి కళాశాలల్లోని యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌-2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 20న ఉదయం 10 గంటల నుంచి 27వ తేది సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్‌.తెలంగాణ.జీఓవి.ఇన్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement