Friday, May 10, 2024

AP: సీఐడీ చీఫ్‌పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు.. అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణ

అమరావతి, ఆంధ్రప్రభ : సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌ కుమార్‌పై రాష్ట్రానికి చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సీఐడీ చీఫ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకే కేసులు నమోదు చేస్తూ చట్టాన్ని అనుకూలంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. కేసులో నమోదు అనంతరం అరెస్టులు, కస్టడీలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను తరచూ ఉల్లంఘిస్తున్నారని ఈ మేరకు ఏడీజీ సునీల్‌ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement