Thursday, May 2, 2024

బండికి నోటీసులు… ఫోన్ దొరికే వ‌ర‌కు రాన‌న్న సంజ‌య్

భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కు కమలాపూర్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అయితే.. పోలీసుల నోటీసులకు బీజేపీ లీగల్‌ సెల్‌ ద్వారా లేఖ పంపారు బండి సంజయ్‌. తన వద్ద ఫోన్‌ లేదని లేఖలో పేర్కొన్న సంజయ్.. తన ఫోన్‌ను ట్రేస్‌ చేసి ఇచ్చేవరకు విచారణకు పిలవద్దని పోలీసులను లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement