Sunday, April 28, 2024

బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన వీరి సుధీర్ కుమార్

బుచ్చిరెడ్డిపాలెం : బుచ్చిరెడ్డిపాలెం నూతన తహసీల్దారుగా వీరి సుధీర్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు మనుబోలు త‌హసీల్దార్ గా పనిచేసిన ఆయన బదిలీపై బుచ్చిరెడ్డిపాలెం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సిబ్బంది సైతం విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు. బాధ్యతలు చేపట్టిన త‌హ‌సీల్దార్ కు డిప్యూటీ త‌హ‌సీల్దార్ విజయ్ కుమార్ ఆర్ఐ సుధాలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement