Friday, May 17, 2024

హిట్ కాంబినేష‌న్ రిపిట్…

సినీరంగంలో సెంటిమెంట్‌ను అందరూ ఫాలో అవుతుంటారు. వీటిలో ప్రధానమైనది కాంబినేషన్‌. ఒక హీరో ఒక దర్శకుడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం హిట్‌ అయితే… మళ్లి అదే కాంబినేషన్‌ రిపీట్‌ చేసేందుకు ఇద్దరూ ఆసక్తి చూపిస్తారు. పూర్వం ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు, అక్కినేని, దాసరి, కృష్ణ, కేయస్సార్‌ దాస్‌ ఇలాంటి కాంబినేషన్స్‌ ఉండేవి. వీరి కలయికలో హిట్‌ సినిమాలు వచ్చేవి. ఇప్పుడు మళ్లి అలాంటి క్రేజీ ప్రాజెక్టులు సెట్స్‌ మీద ఉన్నాయి. సెంటిమెంట్‌ రిపీట్‌ చేస్తున్నారు.
అవేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..

గబ్బర్‌సింగ్‌ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్‌ గబ్బర్‌సింగ్‌. ఇంతకు ముందు వచ్చిన గబ్బర్‌సింగ్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది. ఈ కాంబినేషన్‌ మళ్లిd ఎప్పు డు రిపీట్‌ అవుతందాని అభిమానులు ఎదురుచూ స్తున్నారు. పవన్‌తో తాను తెరకెక్కించే సినిమాకి అ ప్పుడు భవదీయుడు భగత్‌సింగ్‌ అని పేరు పెట్టగా.. ఇటీ-వల ఆ -టైటిల్‌ను ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ గా మార్చారు. కొద్ది రోజుల క్రితమే ఉస్తాద్‌ గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ మొదలైంది. పవన్‌ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఇద్దరి కెరీర్‌లో వచ్చిన ఆర్య సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరి కెరీర్‌ నిలబెట్టిన సినిమా ఇది. ఆ తర్వాత వీరిద్దరి కలయి కలో వచ్చిన ఆర్య 2 ఫలితం నిరాశపరిచింది. అయితే మూడవ సినిమాగా వచ్చిన ‘పుష్ప’ దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఇద్దరి స్థాయి పెంచింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా స్థాయి ప్రాజెక్టుకావడంతో అన్ని చిత్ర పరిశ్రమల్లో పుష్ప 2పై ఆసక్తి పెరుగుతోంది.

ఎన్టీఆర్‌ అండర్‌ప్లే చేసిన చిత్రం జనతా గ్యారేజ్‌. దీనికి కొరటాల శివ దర్శకుడు. వీరి తొలి కాంబినేషన్‌ చిత్రమిది. కమర్షియల్‌గా విజయం సాధించింది. ఇప్పుడు వీరిద్దరు మళ్లి కలిసి పని చేస్తు న్నారు. ఇటీవలే షూటింగ్‌ లాంఛనంగా మొ దలైంది. అతిలోకసుందర్‌ శ్రీదేవి తనయ జాన్వీకపూ ర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం అందిస్తున్నా రు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభమైం ది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది.

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాం బినేషన్‌లో ప్రస్తుతం మూడో చిత్రం రూపొందు తోంది. మహేష్‌కు ఇది 28వ సినిమా. మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. త్రివిక్రమ్‌ సినిమా అనగానే కుటుంబ నేపథ్యం, సున్నిత హాస్యం గ్యారెంటీ. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ చిత్రంలో పూజాహెగ్డే , శ్రీలీల కథానాయికలు. -టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే సంక్రాంతి కానుకగా వ చ్చే ఏడాది జనవరి 13న

- Advertisement -

ప్రేక్షకుల ముందుకు రానుం ది.
మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన తొలి చిత్రం అతడు మంచి విజ యాన్ని అందుకోగా రెండో సినిమా ఖలేజా వినోదం పంచింది.
భీష్మ సినిమాతో సక్సెస్‌ అందుకున్న హీరో నితిన్‌ , దర్శకుడు వెంకీ కుడుముల మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో కూడా రష్మిక నాయికగా నటి స్తోంది. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది.

గీత గోవిందం సినిమా హీరోగా నటించిన విజయ్‌ దేవరకొండకు చిత్ర దర్శకుడు పరశురామ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2018లో వచ్చిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టు-కోవడమే కాకుండా, మ్యూజికల్‌గానూ మంచి హిట్‌ కొట్టింది. ఈ క్రేజీ కాంబోలో మరో చిత్రం రాబోతుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్స్‌ త్వరలోనే రానున్నాయి.

27 ఏళ్ల తర్వాత.. సీక్వెల్‌తో
భారతీయుడు తో సంచలనం సృష్టించిన కాంబో కమల్‌హాసన్‌ , శంకర్‌. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆ సినిమా సీక్వెల్‌
భారతీయుడు 2 కోసం వారు మళ్లీ కలిశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తైవాన్‌లో జరు గుతోంది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అప్పుడు మాస్టర్‌.. ఇప్పుడు లియో
తమిళ్‌ హీరో విజయ్‌ , దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కలయికలో వచ్చిన సినిమా మాస్టర్‌ . కోలీవుడ్‌తోపాటు- టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టు-కున్న ఈ కాంబోలో ప్రస్తుతం లియో సినిమా రూపొందు తోంది. త్రిష కథానాయిక. బాలీవుడ్‌ నటు-డు సంజయ్‌ దత్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement