Friday, May 17, 2024

పాదయాత్రకు నాయకత్వం వహించడం లేదు.. రాహుల్ గాంధీ

తాను పాదయాత్రకు నాయకత్వం వహించడం లేదని, తాను పాదయాత్రలో పాల్గంటున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాగర్ కోయిల్ లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ… దేశంలోని వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందన్నారు. విపక్షాలపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతుందన్నారు. తాము చేస్తున్నది రాజకీయ పోరాటం కాదన్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడిగా తాను పాదయాత్రలో పాల్గొంటున్నానన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఈ యాత్ర అన్నారు. తమ పార్టీకి సంబంధించినంత వరకు ఇది దేశ ప్రజలను అర్థం చేసుకునేందుకు నిర్వహిస్తున్న యాత్ర అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement