Friday, May 17, 2024

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిదిరోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్తున్నాడు. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. మహాగణపతిని తరలించడానికి 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో 26 టైర్ల టస్కర్‌ వాహనాన్ని ఏర్పాటు చేశారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహా గాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్‌ పంచముఖ మహాగణతి సెన్షెన్‌ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోనున్నారు. మొత్తం 2.5 కిలోమీటర్ల పొడవు సాగనున్న శోభాయాత్ర ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు గణపయ్య నిమజ్జనం పూర్తికానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement