Tuesday, April 30, 2024

న‌ల్గొండ‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. నల్గొండ హనుమాన్ నగర్‌లోని ఒకటో నంబర్ వినాయకుడి వద్ద మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభా యాత్రను ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 15 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. నల్గొండలోని అన్ని గణేష్ విగ్రహాలు క్లాక్ టవర్ మీదుగా గణేష్ శోభయాత్ర సాగనుంది. 10 – 20 అడుగుల పెద్ద విగ్రహాలు దండంపల్లి కాలువ వద్ద, 10 అడుగుల విగ్రహాలు వల్లభరావు చెరువు వద్ద నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సూర్యాపేటలో మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement