Wednesday, May 1, 2024

నిత్యానంద స్వామికి నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్-ఎక్క‌డ ఉన్నాడో తెలియ‌క పోలీసుల‌కి తిక మక‌

నిత్యానంద స్వామికి కోర్టు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి బెంగళూరులోని రామనగర జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ ని ఇష్యూ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని 2019లో కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆయన దేశం విడిచి పోయారనే వార్తలు కూడా వచ్చాయి. దాంతో బాధితులు కోర్టుకు తమ ఆందోళనను తెలియజేశారు. దాంతో కోర్టు నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా నిత్యానంద ‘కైలాస’ అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసినట్టు గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కైలాస దేశం ఎక్కడుందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాస అనే పేరు పెట్టారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈక్వెడార్ ఖండించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement