Tuesday, May 7, 2024

రాజస్థాన్‌లోనూ నైట్ కర్ఫ్యూ..

కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన అంశాలకు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే మహారాష్ట్ర తో పాటు పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఇప్పుడు ఆ జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. మహమ్మారి కట్టడికి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెలాఖరు వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది.

రాజస్థాన్‌లో నిన్ను ఒక్కరోజే 6,200 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ఒక్క జైపుర్‌లోనే 1,325 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 40 వేల క్రియాశీలక కేసులు ఉన్నాయి. దీంతో 1500 కఠిన నిబంధనలను చేపడుతోంది. సాయంత్రం ఐదు గంటలకే అన్ని మార్కెట్లు మూసివేయడం, విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలను మూసి ఉంచడం వంటి నిబంధనలు సైతం అమల్లో ఉండనున్నాయి. బహిరంగ సభలు, క్రీడా కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వివాహాలకు కేవలం 50 మందినే అనుమతించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement