Friday, April 26, 2024

వికారాబాద్ విషాదం.. వరుడు క్షేమం.. వదువు మృతి

వికారాబాద్ జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభ్యమైంది. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క క్షేమంగా బయటపడ్డారు. నవ వధువు ప్రవల్లిక, శ్వేతా, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలను వెలికితీశారు. ఎనిమిది సంవత్సరాల ఇషాంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న రాత్రి వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. నిన్న వధువు ఇంటి నుంచి రావులపల్లి వెళ్తుండగా తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. వధూవరులతో పాటు నవాజ్ రెడ్డి అక్కలు శ్వేత, రాధమ్మ, మరో బాలుడు కారులో ఉన్నారు. వద్దని వారించినా వాగు దాటేందుకు ప్రయత్నించడంతో ప్రమాదంలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement