Thursday, May 16, 2024

కొత్త సెక్రెటేరియట్‌ పనులు యమ స్పీడ్‌.. పరిశీలించిన సీఎం కేసీఆర్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: దేశం గర్వించేలా తెలం గాణ సచివాలయ నిర్మాణం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని, నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరిత గతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనులపురోగతిపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకు కృషి చేస్తున్న ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారులను సీఎం అభినం దించారు. కాంక్రీట్‌ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగు లకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి సహా ఆర్‌అండ్‌బీ అధికారులను వర్క్‌ ఏజెన్సీ ఇంజనీర్లతో పనుల గురించి చర్చించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్‌ చాంబర్లు, పార్కింగ్‌ ఏరియాలు, సెక్రెటరీలు, వీఐపీల చాంబర్లను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తూ అధికా రులకు తగు సూచనలిచ్చారు. కారిడార్ల సహా గ్రౌండ్‌ ఫోర్లు, మొదటి ఫ్లోర్‌తో సహ నిర్మాణంలో ఉన్న సచివాలయ ప్రాంగణ మంతా కలియతిరిగారు. తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన ఎలివేషన్‌ తదితర ఫైనల్‌ వర్కుల కోసం తగు సూచనలు చేశారు.

సచివాలయం బాహ్య అలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్‌ టైల్స్‌, గ్రానైట్స్‌ తదితర మోడళ్లను అధికారులు ప్రదర్శ నకు పెట్టారు. వాటి నాణ్యతను, కలర్‌ డిజైన్లను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ ఎలివేషన్‌ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపిం చేలా ఉండాలని సూచించారు. వాల్‌ గ్లాడింగ్‌ టైల్స్‌, గ్రానైట్స్‌, యూపీవీసీ విండోస్‌, అల్యూమినియం ఫాబ్రికేషన్స్‌, మెట్లకు వేసే గ్రానైట్స్‌, ఫ్లోరైడ్‌ మార్బుల్స్‌, గ్రానైట్స్‌ పలు రకాల మోడళ్లను అధికారులు సీఎంకు చూపించారు. తన వెంట వచ్చిన మంత్రి సబితారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకుని వాటిలో కొన్ని మోడళ్లను సీఎం ఫైనల్‌ చేశారు. మోడల్‌ వాటర్‌ ఫౌంటేన్‌, లాండ్‌ స్కేప్‌, విశ్రాంతి గదులు, మీటింగ్‌ హాళ్లను సీఎం పరిశీలించారు. స్కై లాంజ్‌ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు.

వావ్‌.. అద్భుతం
నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగులు ప్రశాంతంగా పని చేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన సీఎం సంతోషం వ్యక్తంచేశారు. పలు రకాలుగా పరిశీలించి తాను సూచించిన మేరకు నిర్మాణం జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. ఇందుకు ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డిలను అభినందించారు. ప్రస్తుతం నడుస్తున్న పనితీరును అదేవిధంగా కొనసాగించాల న్నారు. సచివాలయాన్ని సర్వాంగా సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ఇప్పటికే ఆరు అంతస్థుల స్లాబ్‌ల నిర్మాణం పూర్తికాగా, మరో అంతస్థు నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. వేసవి నాటికి పనులన్నీ పూర్తిచేసి, దసరానాటికి నూతన సచివాలయాన్ని ప్రారంభించే యాచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, నిర్మాణ ఏజెన్సీ షాపూర్‌జీ పల్లోంజీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement