Friday, May 17, 2024

Big Breaking | రేషన్ డీలర్లతో చర్చలు సఫలం.. సమ్మే విరమణ‌

డిమాండ్ల సాధనకోసం సమ్మే చేస్తున్న‌ రేషన్ డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలో ఇవ్వాల (మంగ‌ళ‌వారం) బేటీ అయ్యారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమ్మే విరమించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్నామని రేషన్ డీలర్ల జేఏసీ ఛైర్మన్ నాయికోటి రాజు, ఇతర నేతలు మంత్రి సమక్షంలో ప్రకటించారు.

గతంలో ఇచ్చిన హామీ మేరకు డీలర్ల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి, 2 కోట్ల 83 లక్షల పేదల ప్రయోజనాల పరిరక్షణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం రేషన్ డీలర్లు సహకరించాలని మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement