Friday, May 3, 2024

తెలంగాణలో తగ్గేదిలే..కొత్త‌గా 2,909 మందికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,909 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 584 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,04,548 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,752గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17,791 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 11,495 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 487 మందికి క‌రోనా సోకింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement