Wednesday, May 15, 2024

NCP MP : ఎద్దుల బండి రేసులో గుర్రంపై స్వారీ – మండిప‌డిన ప్ర‌తిప‌క్షం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఎంపి అమోల్ కోల్హే గుర్రంపై స్వారీ చేస్తూ ,ఎద్దుల బండి రేసులో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మాజీ ఎంపీ అధల్‌రావు పాటిల్‌ మాట్లాడుతూ.. ఎంపీ అమోల్‌ కొల్హే ప్రజల కళ్లలో దుమ్మురేపే పని చేస్తున్నారని మండిపడ్డారు. నిజానికి పూణే జిల్లా ఖేడ్ తాలూకాలోని నిమ్‌గావ్ దౌడీ గ్రామంలో ఎద్దుల బండి రేసు నిర్వహించారు. దీంతో ఎన్సీపీ ఎంపీ అమోల్ కోల్హే అక్కడికి చేరుకోగా.. భయం లేకుండా గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు.
దీనిపై శివసేన మాజీ ఎంపీ అధల్‌రావ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. అమోల్ కోల్హే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డిసెంబరు 16న సుప్రీంకోర్టు ఎద్దుల బండ్లపై నిషేధాన్ని ఎత్తివేసిన తర్వాత మాత్రమే తాను ఎద్దుల బండ్ల పందెం నిర్వహించానని, గత రెండు నెలల్లో అనేక ఎద్దుల బండ్ల పందేలు నిర్వహించామని అన్నారు.. ఫిబ్రవరి 11న అమోల్ కొల్హే ఎక్కడ ఉన్నారని మాజీ ఎంపీ అధల్‌రావ్ పాటిల్ అన్నారు. ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకున్నానని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈరోజు అమోల్ కోల్హే వచ్చాడని మండిప‌డ్డారు. దీనిపై ఎంపి అమోల్ కోల్హే మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 16న నిమ్మగావ్ దావడిలో నిర్వహించే ఎద్దుల బండ్ల పందెంకి 400 ఏళ్ల చరిత్ర ఉందని, అందుకే నిమ్మగావ్ దావడి ఎద్దుల బండ్ల పందెంలో పాల్గొనాలని, కాబట్టి నిమ్‌గావ్ దావ్డి యొక్క ఎద్దుల బండ్ల పందెంలో పాల్గొనడం చాలా ముఖ్యం అన్నారు. ఢిల్లీలో సదస్సు జరుగుతోందని.. తాను వెళ్లలేకపోయాయ‌ని అందుకే త‌న‌ని ప్రతిపక్షం నిందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement