Saturday, May 18, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన నాతిచరామి మూవీ టీం

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో సెలిబ్రిటీలు పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో నాతిచరామి మూవీ టీం మొక్కలు నాటారు. సినిమా నటి, నటులు అరవింద్ కృష్ణ,సందేశ్,జయశ్రీ రాచకొండ,డైరెక్టర్ నాగు గవర మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా చిత్ర నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రకృతి మీద ప్రేమ మరింత పెరిగిందని అన్నారు.పర్యవరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. అనంతరం సినీ నటులు రవితేజ,రణ్విజయ్ సింగ్,నటి మీనాక్షి దీక్షిత్ ముగ్గురికి అరవింద్ కృష్ణ గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement