Saturday, April 27, 2024

Nara Lokesh: జే బ్రాండ్ లిక్కర్ తో ప్రాణాలు బలి

ఏపీలో క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌పై టీడీపీ నేత‌లు తెలిపిన నిర‌స‌న‌లో ఆపార్టీ నేత నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. 28 ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా, జే బ్రాండ్స్ లిక్కర్ పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపామని చెప్పారు. అసెంబ్లీలో తమ పోరాటం వలనే ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement