Sunday, May 5, 2024

నా ప్రమాణ స్వీకారానికి తప్పకుండా రావాలే.. మోదీని ఆహ్వానించిన యోగీ

ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ ఇవ్వాల ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల తర్వాత యోగి ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీని కలవడం విశేషం. యూపీ ఎన్నికల్లో విజయం సాధించిన యోగికి ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా అభినందనలు తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ను కూడా యోగి కలిసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ముఖ్యమంత్రిగా తన రాజీనామాను సమర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో పూర్తి పదవీకాలం పూర్తయిన తర్వాత గత 37 ఏళ్లలో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.  ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేయాల్సిన చర్యల జాబితాను ఇప్పటికే రూపొందించింది. యోగి క్యాబినెట్ 2.0 సమావేశంలో సంకల్ప్ పత్ర లేదా అధికారిక మేనిఫెస్టోలో చేర్చబడిన వాగ్దానాలను అమలు చేయడానికి అంతర్గత సన్నాహాలు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement