Thursday, April 25, 2024

Telangana | బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌లో ఎంపీ ర‌విచంద్ర‌.. ఇస్రో ఛైర్మన్ శివన్ తో ప్ర‌త్యేక భేటీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO-ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ కే.శివన్ ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బెంగళూరులో కలిశారు. కర్నాటక ప్రదేశ్ బలిజ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు ఆయ‌న బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు ఆకుల రజిత్, మరికల్ పోత సుధీర్ కుమార్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్ తో కలిసి ప‌ర్య‌టిస్తున్నారు. ఇక‌.. బలిజ సంఘం సంకల్ప సభకు సంఘీభావం తెలిపిన అనంతరం ఎంపీ రవిచంద్ర తన బృందంతో వెళ్లి ఇస్రో ఛైర్మన్ శివన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ప‌లు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement