Friday, May 3, 2024

ఆదిలాబాద్ జిల్లాలో టైగర్స్ .. భయాందోళనలో ప్రజలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు సంచరిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో స్థానికులకు పులులు కనిపించడంతో భయాందోళనకు గురవుతున్నారు. వణికిపోతున్నారు. పెద్దవాగు, ప్రాణహిత తీరం వెంట ఆరు పులులు సంచరిస్తున్న స్థానికులు చెబుతున్నారు. అలాగే కళ్లంపల్లి-జాజుల పేట వద్ద మరో రెండు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు సమాచారం.

పెద్దపులులు సంచరిస్తుండడంతో 18 గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు గుంపుగా వెళ్లాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆయా గ్రామాల ప్రజలు తాము పనులకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement