Friday, May 17, 2024

భారీగా మద్యం.. నగదు పట్టివేత

ఇంటెలిజెన్స్ అధికారులు వ‌చ్చిన ప‌క్కా స‌మాచారంతో దాడులు నిర్వ‌హించి భారీగా క‌ర్నాటక మ‌ద్యం, న‌గ‌దును స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న నెల్లూరులో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ టీమ్‌, సెబ్‌ అధికారుల‌కు అందిన స‌మాచారం మేర‌కు కృష్ణాపురం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వ‌హించారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో త‌నిఖీలు చేప‌ట్ట‌గా సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.14.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బెంగళూరు నుంచి పామూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14 కర్ణాటక మద్యం సీసాలను ప‌ట్టుకున్నారు. ప‌ట్టుబ‌డిన నగదును మర్రిపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించామని ఉదయగిరి ఇంటెలిజెన్స్‌ సీఐ నరహరి తెలిపారు. ఈ తనిఖీల్లో తనతోపాటు ఇన్‌చార్జి సెబ్‌ సీఐ కిరణ్‌కుమార్‌, వారి సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement