Friday, May 10, 2024

భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించిన ముంబై : ఢిల్లీ టార్గెట్ 178 ప‌రుగులు

ఢిల్లీ వ‌ర్సెస్ ముంబై మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ 15 సీజ‌న్ రెండో మ్యాచ్‌లో ముంబై ఢిల్లీకి భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. మొద‌టి ఇన్నింగ్ గా బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబై 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 177 ప‌రుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 178 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్ ఇషాన్ కిష‌న్ 48 బంతుల్లో 81 ప‌రుగులు చేసి జ‌ట్టును ఆదుకున్నాడు. ఇక‌.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌.. 32 బంతుల్లో 41 ప‌రుగులు చేశాడు. తిల‌క్ వ‌ర్మ 15 బంతుల్లో 22 ప‌రుగులు, టిమ్ డేవిడ్ 8 బంతుల్లో 12 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్‌దీప్ యాద‌వ్ 3 వికెట్లు తీయ‌గా.. ఖ‌లీల్ అహ్మ‌ద్ 2 వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement