Tuesday, April 30, 2024

సినీ పరిశ్రమలోని వివాదాలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

సీనియర్ నటుడు మోహన్‌బాబు సినీ పరిశ్రమలోని వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ మొత్తం ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని మోహన్‌బాబు విమర్శించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న వివాదాలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రితో భేటీకి తనకు కూడా ఆహ్వానం ఉందని.. కానీ కావాలనే కొందరు తనని దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట రాజకీయాల మాదిరిగానే పరిశ్రమలోనూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే గ్రేట్‌ అనుకుంటున్నారు. తన దృష్టిలో ఎవరూ గొప్ప కాదన్నారు. మనం చేసే పనులన్నింటినీ పైన భగవంతుడు చూస్తున్నాడని చెప్పారు.

ఇక,సినిమా టికెట్‌ ధరల విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని రెండు నెలల క్రితం బహిరంగ లేఖ విడుదల చేశాను. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. నటీనటులు బిజీగా ఉన్నప్పటికీ సమయం తీసుకుని చర్చించడానికి రావాలని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. నేనే గొప్ప అనే అహంకారం వల్లే అందరం కలవలేకపోతున్నామన్నారు. కానీ, గతంలో అలా ఉండేది కాదు.. అన్ని చిత్రపరిశ్రమలకు చెందిన స్టార్‌ హీరోలు, ఇతర నటీనటులందరం కలిసి ఒకే చోట కూర్చొని ఎన్నో విషయాలపై మాట్లాడుకునేవాళ్లం అని గుర్తు చేశారు. ఇటీవల సినిమా టికెట్‌ ధరల విషయంపై పలువురు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రితో చర్చించడానికి వెళ్లారు. సీఎంవో నుంచి తనకు కూడా ఆహ్వానం ఉందన్నారు. కానీ ఆ విషయాన్ని కొందరు నాకు చెప్పలేదని మోహన్ బాబు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement