Wednesday, May 15, 2024

మోడీకి అపురూప గౌర‌వం.. ఆకాశంలో బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించిన అమెరికా..

న్యూయార్క్‌: అమెరికాలో ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోడీకి అపురూప గౌర‌వం ల‌భించింది.. అమెరికా అధ్య‌క్షుడు జో బైడ‌న్ తో మోడీ భేటి అయిన సంద‌ర్భంలో ఒక విమానం భారత ప్రధాని మోడీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఫొటోలతో ఉన్న భారీ బ్యానర్ తో న్యూయార్క్‌ గగనతలంలో విహరించింది. మోదీ అమెరికాలో పర్యటించినందుకు గుర్తుగా ఇరుదేశాల నేతల చిత్రాలు ఆకాశంలో మెరిశాయి.

దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ మూడు రోజుల ఆమెరికా పర్యటనలో భాగంగా రెండు దేశాల నడుమ అనేక ఒప్పందాలు జరిగాయి. ఇక నేడు ఆమెరికాలో ప‌ర్య‌ట‌న‌ను ముగించుకున్న మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఈజ‌ప్ట్ కు బ‌య‌ల‌దేరి వెళ్లారు.. దేశాధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement