Sunday, May 5, 2024

Breaking: వివాదంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డి.. పోలీసుల‌పై బూతులు, ఫోన్‌లో బెదిరింపులు (ఆడియో)

ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. నిన్న ఇఫ్తార్ విందులో యాలాల ఎస్సైపై బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ఇవ్వాల తాండూరు సీఐకి ఫోన్‌చేసి బెదిరించిన‌ట్టు తెలుస్తోంది. కాగా, వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్‌రెడ్డి మ‌ధ్య‌, మ‌హేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య జిల్లా పోలీసుల‌ను న‌లిగిపోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్‌రెడ్డిపై కేసు పెట్టే ఆలోచ‌న‌లో తాండూరు పోలీసులున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement