Monday, May 20, 2024

సిటీ బ‌స్సులో ఎమ్మెల్యే – ఫుట్ బోర్డుపై ప్ర‌యాణం

ఒక ఎమ్మెల్యే అయి ఉండి సిటీ బ‌స్సు ఫుట్ బోర్డుపై ప్ర‌యాణించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఆయ‌నే త‌మిళ‌నాడు లోని తిరువ‌ళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్ర‌న్..పూండి వద్ద పేద యువతులకు బంగారం ఇచ్చే కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల‌నుకున్నారు. కాలినడకనే ఆయ‌న వెళ్తుండ‌గా అక్క‌డి బస్‌స్టాప్‌ వద్దనున్న విద్యార్థులు ఆయన వ‌ద్ద‌కు వ‌చ్చారు. తాము రద్దీ అధికంగా ఉండే సిటీ బస్సులోనే వెళుతున్నామని చెప్పారు. అదనపు బస్సులు వేయించాల‌ని కోరారు. ఆ స‌మ‌యంలో అక్కడికి పూండి నుంచి బయల్దేరాల్సిన సిటీ బస్సు వ‌చ్చింది. దీంతో వెంట‌నే విద్యార్థులందరూ ఆ బ‌స్సు ఎక్కారు. వారితో పాటు ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కూడా ఆ బస్సు ఎక్కారు. బ‌స్సు నిండిపోయి ఉండ‌డంతో ఆయన కూడా పుట్‌బోర్డుపైనే నిల‌బ‌డి, ప్రయాణించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాల్సి వ‌చ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement