Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి..కాన్వాయ్ ఆపి బాధితుడిని ఆసుపత్రికి తరలించిన సీఎం స్టాలిన్

రోడ్డుపై ప్రమాదానికి గురయిన ఓ వ్యక్తిని కాపాడేందుకు తన కాన్వాయ్ ని ఆపారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైన్నైలోని క్రోమ్ పేటకు చెందిన అరుల్రాజ్ డీఎంఎస్ సమీపంలో బైక్ పై నుంచి కింద పడ్డాడు. అయితే అదే సమయంలో అటు నుంచి సీఎం ఎంకే స్టాలిన్ క్వానాయ్ రాష్ట్ర సచివాలయానికి వెళ్తోంది. ఈ ప్రమాదాన్ని గమనించిన సీఎం తన క్వానాయ్ ను ఆపించారు. రోడ్డు దాటుకొని క్షతగాత్రుడి వద్దకు వెళ్లారు. బాధితుడికి ధైర్యం చెప్పి ఓ ఆటోలో కూర్చోబెట్టారు. అనంతరం క్షతగాత్రుడిని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. రోగిని జాగ్రత్తగా చూసుకోవాలని ఎమ్మెల్యేను, డాక్టర్ ఏజిల్ ను సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement