Saturday, May 18, 2024

‘లాక్​డౌన్’​ మిస్సింగ్​.. చాకచక్యంగా కనిపెట్టిన పోలీసులు

చెన్నైలో తప్పిపోయిన ఓ చిన్నారి కేసును చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పాపను కిడ్నాప్​ చేసిన వారి ఆనవాళ్లను గుర్తించారు. ఆ తర్వాత పాప ఫొటోలను చెన్నై సిటీలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించి సెర్చ్​ చేయించారు.

మొన్నటి ఆదివారం తమ పాప ‘లాక్​డౌన్​’ కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. లాక్​డౌన్ మిస్సింగ్​​ కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. పాప ఫొటోలను అన్ని పోలీస్​ స్టేషన్లకు పంపించారు.  చెన్నైలోని అంబత్తూరులో ఓడిశాకు చెందిన చిన్నారి తల్లిదండ్రులు ఉంటున్నారు. అక్కడే నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​లో పనిచేస్తున్నారు.  అయితే.. కోయంబేడు బస్ డిపోలోని ఓ బస్సులో పాప ఉన్నట్టు మంగళవారం బస్సు డ్రైవర్​ గుర్తించాడు. ఈ విషయం సమీపంలోని కోయంబేడు పోలీసులకు సమాచారం అందించాడు.  

కోయంబేడు పోలీసులు బస్సులో కనిపించిన పాప తప్పిపోయిన చిన్నారి ‘లాక్‌డౌన్’గా గుర్తించారు.  ఆ తర్వాత కొద్దిసేపటికే ఒడిశా దంపతులకు ఆ పాపను అప్పగించారు. కాగా, చిన్నారి లాక్​డౌన్​ మిస్సింగ్​ కేసులో అప్రమత్తమైన అంబత్తూరు పోలీసులు కేసు ఛేదన, పాపను రక్షించడంలో కనబర్చిన  చొరవకు స్థానికుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. చిన్నారి కనిపించకుండా పోయిన ప్రాంతంలోని సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టి, వారిలో ముగ్గురిని కడలూరు దగ్గర అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement