Thursday, May 2, 2024

గుప్త‌నిధుల కోసం తొమ్మిదేళ్ల చిన్నారి బ‌లి : అత్త‌, మామ అరెస్ట్

గుప్త నిధుల కోసం ఓ చిన్నారిని బ‌లివ్వగా.. చివ‌ర‌కు బండారం బ‌య‌ట‌ప‌డ‌డంతో అత్త‌, మామ‌ను అరెస్ట్ చేసిన ఘ‌ట‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. త‌ర్వాత బండారం మూఢ విశ్వాసం ఓ అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధులొస్తాయనే దురాశతో సొంత మేనల్లుడిని భార్యతో కలిసి దారుణంగా హత్య చేశాడు మామ. 9 ఏళ్ల పసివాడి గొంతునులుమి, ఆపై దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్ బాందా జిల్లా చిత్రకూట్​లోని కోత్వాలి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. తమ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, చిన్నారిని బలి ఇస్తేనే అవి దక్కుతాయని కల వచ్చిందని నిందితులు విచారణలో చెప్పడం పోలీసులను షాక్​కు గురి చేసింది. మృతిచెందిన బాలుడికి నిందితులు భుల్లు వర్మ, ఊర్మిళ మామ, అత్త అవుతారు. ఇరువురి కుటుంబాల ఇళ్లు దగ్గరగానే ఉంటాయి. అందుకే బాలుడు తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు.

అయితే మార్చి 8న చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో అతని తండ్రి రామ్​ప్రయాగ్ రాయ్​దాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇంతలో రాఘవ్​పుర్​ స్థానికుల నుంచి పోలీసులకు ఫోన్​ వచ్చింది. నిందితుల ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారింట్లో ఉన్న ఓ కంటైనర్​లో చిన్నారి శవాన్ని గుర్తించారు. అతడి మృతదేహంలో క్షుద్రపూజలు చేసేందుకు సిద్ధమ‌వుతుండగా నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. అయితే కేసును త్వరగా ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికుల నుంచి నిరనస వ్యక్తమైంది. తమ ఇంట్లో గుప్తు నిధులున్నాయని దీపావళి పండగ సమయంలో తమకు ఓ కల వచ్చిందని, చిన్నారిని బలిస్తే అవి తిరిగివస్తాయని ఇలా చేశామని నిందితులు విచారణలో చెప్పినట్లు ఎస్పీ ధవాల్ జైశ్వాల్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement