Friday, May 3, 2024

గంధం చెక్కల చోరీ కేసులో – ఇద్దరి అరెస్టు

పెనుకొండ ఫారెస్ట్ ఆఫీస్ లో గంధం చెక్కల చోరీ కేసులో మరో ఇద్దరిని 1. బాబాజన్ ఏ 1, సెల్వకుమార్ ఏ 2 ను పెనుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 16 లక్షల విలువ చేసే శ్రీగంధం ఆయిల్ , 14 సంచుల గంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ. 2,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ( వీటన్నింటి విలువ రూ. 27 లక్షలు ఉంటుంది). ఈ ఏడాది జనవరి 24 న ఇదే కేసులో ఏడుగురిని అరెస్టు చేసి.. 68 సంచుల శ్రీగంధం చెక్కలు, రెండు ఐచర్ లారీలు, కారు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ ఫారెస్టు ఆఫీస్ లో చోరీ అయిన 92 గంధం చెక్కల సంచులు, గంధం ఆయిల్ కేసులో తాజాగా స్వాధీనం చేసుకున్న వాటితో కలిపి 82 సంచుల గంధం చెక్కలు,గంధం ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్య మీడియాకు వివరాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement