Friday, April 26, 2024

ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!

డబుల్ బెడ్ రూం ఇళ్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఇండ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి త్వరలోనే ఇల్లు నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చేలా పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. సమగ్ర సర్వేలో ఇండ్ల కోసం 26,31,739 దరఖాస్తుల రాగా.. ఇప్పటి వరకు 2.91 లక్షల రెండు పడకల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో  2.27,000 ఇండ్లు ప్రారంభించి 1,03,000 పూర్తి చేశామన్నారు. 70 వేల ఇండ్ల పనులు 90 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం విషయంలో కొందరు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: ఆల్ టైమ్ హైకి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నేటి రేట్లు ఇలా..

Advertisement

తాజా వార్తలు

Advertisement