Monday, May 6, 2024

KTR: మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ సంస్థ.. 30 బిలియన్‌ యూరోలతో ఏర్పాటు

లైఫ్‌ సైన్సెస్‌ సెక్టార్‌లో హైదరాబాద్‌ మరింత పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్‌ వ్యాలీ నడుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్‌ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. 30 బిలియన్‌ యూరోలతో ఫెర్రింగ్‌ కంపెనీ ఏర్పాటయిందని చెప్పారు. టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement