Thursday, May 2, 2024

KTR: హైదరాబాద్ లో కాల్‌అవే గోల్ఫ్‌.. రూ.150 కోట్లతో అతిపెద్ద డిజిటెక్‌ కేంద్రం

మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ముందు ఉన్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉందని, సంస్థ తన రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌ నగరంలో ఉన్నదని చెప్పారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement