Monday, April 29, 2024

KTR: విమ‌ర్శలు చేయ‌డం సుల‌భం.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్టం

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయ‌కుల‌పై మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. విమ‌ర్శలు చేయ‌డం సుల‌భం.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట్ మండ‌లం వెంక‌టాపూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. మీరు ప‌రిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మించారా? అని బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ‌కు మీరు ఏ ఊరికి ర‌మ్మంటే ఆ ఊరికి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement