Saturday, April 27, 2024

దొంగ మ‌ల్ల‌న్న స్వామికి ‘తులాభారం’ వేసి మొక్కులు చెల్లించుకున్న మంత్రి కొప్పుల‌

మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ జ‌గిత్యాల జిల్లా గొల్ల‌ప‌ల్లి మండ‌లంలోని దొంగ మ‌ల్ల‌న్న స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి మంత్రి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంతరం తులా భారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు. కాగా ఈ కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement