Tuesday, May 21, 2024

ఉక్రెయిన్ లో  చిక్కుకున్న నిర్మల్ విద్యార్థి.. క్షేమంగా రప్పిస్తామన్న మంత్రి

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన వారిని సురక్షితంగా  ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.  నిర్మల్ పట్టణం బుధవార్ పేట్ కు చెందిన పీజీ వైద్య విద్యార్థి సాయికృష్ణతో ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీడియో కాల్ లో మాట్లడారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రప్పించాలని  కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరడం జరిగిందని,  రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని వెల్లడించారు.  ఎలాంటి ఆందోళన చెందవద్దని సాయికృష్ణకు మంత్రి ధైర్యం చెప్పారు.   భయపడాల్సిన అవసరం లేదని,  సాయికృష్ణను క్షేమంగా ఇంటికి రప్పిస్తామని ఆయన తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement