Friday, May 10, 2024

ఘోర రోడ్డు ప్ర‌మాదం .. 53మంది మృతి ..54 మందికి తీవ్ర గాయాలు ..

ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 53మంది వ‌ల‌స కూలీలు మ‌ర‌ణించారు. కాగా ఈ సంఘ‌ట‌న మెక్సికోలో జ‌రిగింది. ట్ర‌క్కులో ప‌రిమితికి మించి బ‌రువు ఉండ‌టం, డ్రైవ‌ర్ వేగంగా ట్ర‌క్క్ ని న‌డ‌ప‌డం వ‌ల్లే బోల్తా ప‌డినట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో చిన్నారులు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో 54మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెక్సికో నుంచి వ‌ల‌స కూలీలు అమెరికా స‌రిహ‌ద్దుల వైపున‌కు వెళ్తున్న స‌మ‌యంలో ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement