Sunday, April 28, 2024

Covid: దేశంలో 8,503 కరోనా కేసులు.. 624 మరణాలు

దేశంలో నిన్న పెరిగిన కరోనా కేసులు.. నేడు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్త‌గా 8503 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. కోవిడ్ నుంచి 7678 మంది కరోనా నుంచి కోలు కున్నారు. వైరస్ కారణంగా మరో 624 మంది మరణించారు. దేశంలో 94,943 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,05,066కు చేరింది. ఇందులో 3,41,05,066 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,74,735 మంది మరణించారు. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.31 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement