Friday, May 17, 2024

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు – మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ మేర‌కు నిస్సి చ‌ర్చ్ లో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల స్వార్థాన్ని వీడి, ప్రేమ కలిగి జీవించమని చెప్పిన యేసుక్రీస్తు మానవజాతికి ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ..

దేశంలో ఎక్క‌డా లేని విధంగా అన్ని మ‌తాల‌కు సంబంధించిన పండ‌గుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ద‌ని తెలిపారు. క్రిస్మ‌స్ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు, పేద క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం త‌ర‌పున నూత‌న‌ వస్త్రాలను పంపిణీ చేస్తున్నామ‌న్నారు. ఈ కార్యక్రమంలో…అల్లోల మురళీధర్ రెడ్డి,మాజీ డీసీసీబీ-చైర్మన్-కోరిపెల్లి విజయలక్ష్మి-రాంకిషన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్-నర్మదా ముత్యం రెడ్ది, facs చైర్మన్-ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ-కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి,కౌన్సిలర్స్-పూరడి శ్రీకాంత్, నాయకులు-రవి,జి. నర్సయ్య,పాస్టర్స్ ,తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement