Friday, May 10, 2024

Tribute To Vajpayee: మాజీ ప్రధాని వాజ్ పేయీకి మోదీ నివాళి

భారత్ మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​ పేయీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం ‘సదైవ్​ అటల్​’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సహా కేంద్ర మంత్రులు, ప్రముఖులు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ చేసిన సేవ స్ఫూర్తిదాయకం అని అన్నారు. దేశాన్ని పటిష్ఠంగా, అభివృద్ధిమయంగా మార్చేందుకు ఆయన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మిలియన్ల మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయని మోదీ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement