Saturday, May 4, 2024

Telangana: ఉర్దూ, పర్షియన్​ భాషల పరిరక్షణకు చర్యలు.. ఇరాన్​, ఇండియా మధ్య ఒప్పందం

భారతదేశం, ఇరాన్​ మధ్య ఉమ్మడి వారసత్వం అయిన ఉర్దూ, పర్షియన్​ భాషలతో పాటు చారిత్రక మాన్యుస్క్రిప్ట్​ల మరమ్మతు, పరిరక్షణ, డిజిటలైజేషన్​ వంటి అంశాలపై ఇవ్వాల (బుధవారం) ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కాగా, మంత్రి కేటీఆర్ సమక్షంలో హెచ్ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని ఈ ఎంఓయూని అందుకున్నారు. స్టేట్ ఆర్కైవ్స్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, తెలంగాణ ప్రభుత్వం.. నూర్ మైక్రోఫిల్మ్ ఇంటర్నేషనల్ సెంటర్, ఇరాన్ కల్చరల్ హౌస్, ఇండియాలోని ఇరాన్ ఎంబసీ, ఢిల్లీ మధ్య దీనికి సంబంధించిన ఒప్పందం ఉండనుంది.

ఈ చొరవ లక్షలాది పత్రాలకు జీవం పోస్తుందని, భవిష్యత్ తరాలకు తెలంగాణకు సంబంధించిన గొప్ప వారసత్వం, చారిత్రక అంశాలను తెలియజేసేలా ఉంటుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఎంఓయూ కార్యక్రమంలో ITE&C ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్టేట్ ఆర్కైవ్స్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మెహదీ ఖాజే పిరి, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఇ.విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement